స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 3000 మంది దివ్యాంగులు యోగా చేశారు. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా చేసినందుకు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు డాక్టర్ వీరేంద్రకుమార్, ఎ.నారాయణస్వామి పాల్గొన్నారు. వారితో పాటు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ (దాజీ) హాజరయ్యారు. దాజీ నేతృత్వంలో సుమారు 3వేల మంది దివ్యాంగులతో కలిసి కేంద్రమంత్రులు ధ్యానం చేశారు. దివ్యాంగుల సాధికారత విభాగం-దివ్యాంగజన్, ఎన్ఐఈపీఐడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వేదికపై ప్రధాని నరేంద్రమోదీ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
0
366
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


