స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 3000 మంది దివ్యాంగులు యోగా చేశారు. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా చేసినందుకు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు డాక్టర్ వీరేంద్రకుమార్, ఎ.నారాయణస్వామి పాల్గొన్నారు. వారితో పాటు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ (దాజీ) హాజరయ్యారు. దాజీ నేతృత్వంలో సుమారు 3వేల మంది దివ్యాంగులతో కలిసి కేంద్రమంత్రులు ధ్యానం చేశారు. దివ్యాంగుల సాధికారత విభాగం-దివ్యాంగజన్, ఎన్ఐఈపీఐడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వేదికపై ప్రధాని నరేంద్రమోదీ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
0
392
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


