2006లో జరిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2006 జూన్ 3న నింబాల్కర్ (41), ఆయన డ్రైవర్ సమాద్ కాజీ.. ముంబై నుంచి ఉస్మానాబాద్ కారులో వెళ్తున్నారు. నవీ ముంబైలోని కాలంబోలి వద్ద కారును అడ్డగించిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య కేసులో నింబాల్కర్ బంధువు, మాజీ ఎన్సీపీ ఎంపీ పద్మసింగ్ పాటిల్ (86) సహా పలువురు విచారణను ఎదుర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంగా కొనసాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
పవన్రాజే నింబాల్కర్ హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు
0
11
Previous article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


