స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. చెంగల్పట్టు, విలుప్పురం ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి దాదాపు 12 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇంతమంది చావులకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
కల్తీ మద్యం తాగి 12 మంది దుర్మరణం
0
408
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


