వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీవో, ఎమ్మార్వో వాహనాలకు అడ్డుగా నిలుచున్నారు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం పై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని.. రాత్రి పూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదంటున్నారు గిరిజనులు.
అర్ధరాత్రి భూ సర్వేలు …అడ్డుకున్న గిరిజనులు
0
432
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


