బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
మహబూబాబాద్, తొర్రూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. దీనికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ప్రజా ప్రతినిధులు హాజరైనారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు ప్రోటోకాల్ సరిగా లేదని ఒకరిపై ఒకరు వాదనకి దిగారు. దీంతో కార్యక్రమం కాస్త రసాభాసాగా మారింది.
ఆటో బోల్తా
కర్నూలు జిల్లా పెంచికలపాడు గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. పత్తికొండ రాజీవ్ నగర్కు చెందిన వెంకటస్వామి అనే ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందా డు. పత్తికొండ నుంచి ఆటోలో కర్నూలు వెళ్తుండగా పెంచికలపాడు గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
విద్యార్థి సంఘం దర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని కారుణ్య మృతి తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతికి నిరసనగా అఖిలపక్ష సంఘం నాయకులు, బంధువులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కాలేజీ ముందు ధర్నా చేశారు. కాలేజీ సీజ్ చేసి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వ్యక్తిపై దాడి
వికారాబాద్ జిల్లా గెరిగేంట్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కల్లు తాగి ధర అమాంతం ఐదు రూపాయలు ఎలా పెంచుతారని వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ను నిలదీశాడు. ఈనేపథ్యంలోనే ఇద్దర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దత్తాత్రేయ గౌడ్ తన అనుచరులతో కలిసి శ్రీనివాస్, మరో వ్యక్తిపై దాడి చేశా రు. ఈ ఘటనలో శ్రీనివాస్ తల, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో వికారాబాద్ పోలీసులు దత్తాత్రేయపై కేసు నమోదు చేశారు.
డంపింగ్ యార్డ్ కష్టాలు
చిత్తూరు జిల్లా కుప్పంలోని 9వ వార్డు ప్రజలు డంపింగ్ యార్డు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షం నీరు డీకే పల్లి చెరువులోకి వెళ్తే తాము అనేక రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
విత్తనాల కోసం రైతుల పడిగాపులు
రంగారెడ్డి జిల్లా కందవాడ గ్రామంలో సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పట్టించుకునే నాథుడే లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు తమ గ్రామాలకు అందడం లేదని మండిపడుతున్నారు. తిండి తిప్పల లేక సబ్సిడీ విత్తనాల కోసం రైతు వేదిక దగ్గరికి వస్తే అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా రు వాపోయారు రైతులు.
ఎవరెస్ట్ ఎక్కిన దివ్యాంగుడు
గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్ అనే యువకుడు అందరినీ హౌరా అనిపించాడు. కాళ్లు, చెయ్యి లేకపో యినా ఎవరెస్ట్ ఎక్కాడు. తొమ్మిదేళ్ల వయస్సులో కరెంట్ షాక్తో రెండు కాళ్లు, చెయ్యి కోల్పోయాడు కౌశిక్. అయినా పట్టుదలను కోల్పోలేదు. కృత్రిమ అవయవాలతో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ ఆంప్యూటీ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
ఇంట్లో చోరి
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అన్నోజి గూడలోని ఓ ఇంట్లో 16 తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలతో పాటు లక్షా 40వేల రూపా యల నగదును దుండగులు దోపిడీ చేశారు. దుండగులను త్వరగా పట్టుకొని తమ సొమ్ముని ఇప్పించా లని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఒంటరి మహిళ ఇంట్లో దుండగుల చోరి
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చోరీ జరిగింది. తిరుమల శెట్టి పార్వతమ్మ అనే ఒంటరి మహిళ నివాసంలోకి దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి పార్వతంపై దాడి చేసి, బంగారంతో పాటు నగదు దోపిడీ చేశారు. పార్వతమ్మ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఘోర రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా అప్పరాజుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ లారీ వేగంగా ఢీకొంది. దీంతో సుబ్బనరసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు రాజంపేట ప్రభుత్వాసు పత్రికి తరలిం చి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని, డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారణ ముమ్మరం చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
నేడు తిరుమల శ్రీవారిని ప్రముఖులు భారీగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తమిళ నాడు మంత్రి రామచంద్రన్, మహారాష్ట్ర మంత్రి సంజయ్ బ్యాన్సోడ్, ఏపీ హైకోర్టు జడ్జీ కృపాసాగర్, టీడీపీ లీడర్లు సత్యప్రసాద్, సాంబశివరావు, రవికుమార్, బాబు రాజేంద్రప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించ గా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాల అందజేశారు.