తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడ నుంది. ఆశావహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కాసేపట్లో భేటీ అయ్యింది. ఈ భేటీలో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదు పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయ నున్నారు. రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కలతో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు భేటీ అయ్యి అభిప్రాయాలు తీసుకోను న్నారు. ఈ భేటీల్లో తీసుకున్న అభిప్రాయాలు, పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్ర్కీనింగ్ కమిటీ.. ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ.. అభ్యర్థులను ఖరారు చేయనుంది.
నేడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన
0
637
Previous article
Next article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


