రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత దాదాపు 30 మంది గులాబీదళ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారని, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పొల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నానని, తన గురించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఇలా మాట్లాడడం ఆశ్యర్యంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్గఢ్లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్క సుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.