ఆ గృహిణికి జ్యోతిషమంటే నమ్మకం. యూట్యూబ్ ద్యారా తెలుసుకున్న జ్యోతిషం ప్రకారం.. దంపతులం విడిపో తామని బలంగా నమ్మింది. ఇదే విషయం తరచూ భర్తతో అనేది. ఈక్రమంలో భర్త కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మ హత్యకు పాల్పడింది. అంబర్పేటలో నివసించే చందు, స్వరూప దంపతుల కుమార్తె బబితకు ఐదేళ్ల కిందట బాలం రాయికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో పెళ్లి జరిపించారు. కానాజిగూడ ఇందిరానగర్లో కాపు రంపెట్టారు. వీరికి మూడేళ్లబాబు ఉన్నాడు.
ఆదివారం కుమారుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు హాజరుకాలేదు. సోమవారం ఉదయం భర్త విధులకు వెళ్లాడు. తర్వాత రెండుగంటలకు అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూసి కింది పోర్షన్లో బాబాయికి చెప్పా డు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది.
మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రాముపై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే మృతి చెందిందని పోలీసు లకు ఫిర్యాదుచేశారు. జ్యోతిషాన్ని నమ్మవద్దని బబితను రాము పదేపదే కోరేవాడని… దీనిపై ఇటీవల వాగ్వాదం చోటు చేసుకోగా, అందరిముందు ఆమెను కొట్టాడని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.