నిఘా నీడలో అయోధ్య…. ప్రాణ ప్రతిష్టకు భారీ భద్రత

          అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ – డ్రోన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సెక్యూరిటీ ఎస్పీ గౌరవ్‌ బంస్‌వాల్‌ తెలిపారు. పోలీసు దళాలకు సాయపడేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతు న్నట్లు శాంతిభద్రతల డీజీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. అయోధ్యకు వచ్చే మార్గాల్లో ఆక్రమణలన్నీ తొలగించి పరిశుభ్రం చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సూచనలు అందజేస్తామని.. రైల్వేస్టేషను, బస్‌ స్టేషన్లలో అదనపు బలగాల పహారా ఉంటుందని డీజీ వివరించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్