హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ వేల కోట్లు దండుకున్నట్లే… ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వేలకోట్ల ఆదాయం సంపాదించుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి పోరాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు
0
178
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


