పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శివరాత్రి ముగింపు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా దాసరి పుష్ప అనే బాలిక తలపై మృతి చెందింది. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం త్యాజం పూడి గ్రామం నుంచి శివరాత్రి వేడుకలు తిలకించడానికి వచ్చి ప్రమాదానికి గురయిందని బాలిక బంధువులు తెలిపారు.బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.