రాజస్థాన్‌ కోటాలో విషాదం… ప్రసవం తర్వాత నలుగురు మహిళలు మృతి

రాజస్థాన్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రసూతి మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కోటా నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో మహిళ మృతి చెందడంతో వారం రోజుల్లో మరణించిన మహిళల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది.

కోటాలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన 31 ఏళ్ల పింకీ మహావర్ ఇటీవల ప్రసవం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేకే లోనే ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 7న ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పింకీ భర్త చంద్రప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం… ఆపరేషన్ తర్వాత ఆమె బీపీ తీవ్రంగా పడిపోయిందని, మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోయిందని, కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపించాయని చెప్పారు.

అయితే పరిస్థితి విషమిస్తున్నప్పటికీ వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మే 10న పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిన తర్వాత మాత్రమే ఆమెను న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ — NMCHలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు తరలించారని తెలిపారు.

డాక్టర్లు మొదట సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత… మరుసటి రోజే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారని, దీంతో కేవలం 15 గంటల వ్యవధిలో మరోసారి శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. అనంతరం అంబులెన్స్‌లో NMCH సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె మరణించింది.

ఇదే వారంలో జేకే లోనే ఆస్పత్రిలో సిజేరియన్ చేసిన తర్వాత మరణించిన రెండో మహిళ పింకీ . అయితే సమస్య ఇక్కడితో ఆగలేదు.

NMCH ఆస్పత్రిలో సిజేరియన్ ఆపరేషన్‌ల తర్వాత కనీసం ఆరుగురు మహిళలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. వీరిలో పలువురికి:

ప్లేట్లెట్లు పడిపోవడం
రక్తపోటు తీవ్రంగా తగ్గిపోవడం
మూత్రం ఆగిపోవడం
కిడ్నీ సమస్యలు తలెత్తడం

వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించినట్లు సమాచారం.

ఇప్పటికే 22 ఏళ్ల ప్రియా మహావర్, పాయల్, జ్యోతి నాయక్ అనే మహిళలు కూడా చికిత్స పొందుతూ మరణించారు. పాయల్ మే 5న, జ్యోతి నాయక్ మే 7న ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం మరో ఆరుగురు ప్రసూతి మహిళలు NMCH సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో అత్యంత వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులెటిన్ తెలిపింది.

ఈ ఘటనలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరుస మరణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే NMCH ప్రిన్సిపల్ డాక్టర్ నిలేశ్ జైన్ స్పందిస్తూ… పింకీ మహావర్ గర్భధారణ ప్రారంభం నుంచే “హై రిస్క్ పేషెంట్” అని తెలిపారు. అలాగే JK లోనే ఆస్పత్రి నుంచి వచ్చిన కేసులు, నేరుగా NMCHలో చేరిన మహిళల లక్షణాలు భిన్నంగా ఉన్నాయని… ఇప్పుడే అన్ని కేసులను ఒకే కారణంతో అనుసంధానం చేయలేమని చెప్పారు.

మరోవైపు పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఈ ఘటనలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సార్ స్వయంగా ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. వైద్య నిర్లక్ష్యం జరిగిందా? లేక కలుషితమైన మందులు లేదా మెడికల్ సరఫరాల వల్ల ఈ మరణాలు సంభవించాయా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్