బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ క్యాంపస్లో గిరిజన జీవనోపాధి పద్ధతులు – సాధికారత, సమస్యలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ కంపెనీలు, కార్పొరేట్లు అడవులను నాశనం చేస్తున్నాయన్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమని.. అడవుల ఆధారంగా బతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ జాతుల అభివృద్ధి జరగలేదన్నారు.
సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారు – సీతక్క
0
282
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


