తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది. హోరాహోరీగా సాగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాయంత్రంతో ముగియనుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తవుతుంది. చివరిరోజు అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారా న్ని స్పీడప్ చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు చేరువయ్యేందుకే అన్ని పార్టీల నాయకులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బహిరంగ సభలను తగ్గించిన పార్టీలు కార్నర్ మీటింగ్లు, రోడ్షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాయి. స్టార్ క్యాంపెయి నర్లు సైతం సమ్మేళనాలు, రోడ్షోలకే ప్రాధాన్యమిచ్చి ప్రచారం నిర్వహించారు. వీటికి తోడు పార్టీల మ్యానిఫెస్టోలు, నినాదాలు, లోకల్ మ్యానిఫెస్టోలతో పాటు ప్రధాని మొదలు సీఎం, మాజీ సీఎం, ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంభాషణల వీడియోలను సోషల్మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సప్ గ్రూప్ల ద్వారా తమ నినాదాన్ని అభ్యర్థులు విస్తృతంగా ఓటర్ల దరికి చేర్చారు. ఓటర్లను అభ్యర్థిస్తూ వాయిస్ మెసేజెస్ ముంచెత్తాయి. ఎల్లుండి 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు జరుగుతు న్నాయి. లోక్సభతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఎల్లుండే జరగనుంది. జూన్ 4న లోక్సభ, ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.