24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

గాలిలో పల్టీలు కొట్టిన కారు.. మహిళ మృతి

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు.. గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలితీసుకుంది. కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ(40)అనే మహిళ మృతిచెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్ వైపు అతివేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. అతివేగంగా ఉండడంతో కారు రోడ్డుపై నుండి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కారు డ్రైవర్‌ను అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

జ్యోతి స్వరూపంలో అయ్యప్పను దర్శించుకున్న స్వాములు

మకర సంక్రాంతి పర్వదినాన, మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా ఎదురు చూసి జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తిపారవశ్యం చెందారు. జ్యోతి దర్శనానికి ముందు ఎక్కడ చూసిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్