వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిసే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా.. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేస్తామన్నారు కొల్లు రవీంద్ర.