కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికా రులు, పొడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు రైతుల ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోడు దారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. గిరిజ నులు గొడ్డళ్ళు, కర్రలు, రాళ్ళ తో అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాయడ్డారు.