Ankita Thakur | తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్ మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 14 రాష్ట్రాల అమ్మాయిలను వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్ కిరీటం గెలుచుకుంది. కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో అంకిత విజేతగా నిలిచింది. రశ్మిక ఠాకూర్ శిక్షణలో తెలంగాణ ప్రతినిధిగా అంకితా ఠాకూర్ పోటీలో గెలిచి సత్తా చాటింది.