స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం రోజున లాభాలతో ముగింపు పలికాయి. సెన్సెక్స్ 240.36 పాయింట్లు లాభపడి 62,787.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్ల లాభంతో 18,593.85 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.67గా ఉంది. హెచ్సీఎల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో మునిగాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టైటాన్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.