అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. దీంతో అసం తృప్తితో ఉన్న చిట్టిబాబు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఉన్న పీసీసీ ఛీప్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక పి.గన్నవరం కాంగ్రెస్ టిక్కెట్ చిట్టిబాబుకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.