బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారని పోచారం పీఎస్లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలుపైకి ఓ వైపు హైడ్రా బుల్డోజర్లు తీసుకువెళ్తున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావడం ఆసక్తికర పరిణామంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్
0
174
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


