తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చానని మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించడంతో పని అయిపోయిందని.. ఏపీలో పని పడింది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల.. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయా లు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు, ఎంపీకి మళ్లీ వైసీపీ టికెట్లు ఎలా ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు.


