ఏపీ వ్యాప్తంగా పవన్ తిరిగే పరిస్థితి లేదని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపో తారని జోస్యం చెప్పారు. పవన్కు రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. 2 రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటాడని సెటైర్లు వేశారు. చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలువలేరని అంబటి ఫైర్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ మరో సారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు.


