చంద్రబాబు, చిరంజీవిలపై వైసీపీ నేత పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలని చిరంజీవి స్టేట్ మెంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఎమ్మెల్యేలు గెలుస్తే కాంగ్రెస్ లో విలీనం చేశారని మండిపడ్డారు. ప్రజల గురించి చెప్పే హక్కు చిరంజీవికి లేదన్నారు. కాపులు చిరంజీవిని నమ్మి మోసపోయారని చెప్పారు. పేదల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. చంద్రబాబు ఎన్నో హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శిం చారు.