సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు, ఇసుక దందాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని అంబేద్కర్ కోన సీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఈ సారి ఎన్నికల్లో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తుతో నియోజకవర్గంలో విజయం వైపు అడుగులు వేస్తామని ఆయన అన్నారు. తన సోదరుడు బండారు శ్రీనివాస్ మద్దతు తనకు ఉందన్నారు. పొత్తులో భాగంగా తనకు టికెట్ ప్రకటించిన తర్వాత నియోజక వర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు కాసింత ఆగ్రహానికి గురైనా… తర్వాత పవన్ కల్యాణ్ ఆదేశాలతో వారంతా తనకు మద్దతు ఇస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బండారు సత్యానందరావు.
కొత్తపేట నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా సత్యనందరావు
0
487
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


