స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మునిసిపాల్టీ నుండి అనుమతులు పొందకుండా బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టారు. అనేక మార్లు హెచ్చరించిన ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన రెవిన్యూ అధికారులు.. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. అధికారులు – బిల్డర్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.