తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి, ఓ ‘స్వీట్’ గిఫ్ట్ తీసుకు న్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం.. రాహుల్ అభిమానానికి కృతజ్ఞ తలు తెలిపారు.
కొయంబత్తూరులో స్టాలిన్తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభ అనంతరం నిన్న రాత్రి సింగన ల్లూరులోని ఓ మిఠాయి దుకాణానికి రాహుల్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అందులో కాంగ్రెస్ నేత రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటి దుకాణానికి వెళ్లారు. రాహుల్ను చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏం కావాలి సర్? అని అడగ్గా.. బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనాలి అని చెప్పడం వీడియోలో ఉంది. ఈ సందర్భంగా షాప్లోని మిఠాయిలను రాహుల్ రుచిచూ శారు. అనంతరం ఆ స్వీట్లను తీసుకుని స్టాలిన్ ఇంటికి వెళ్లి సీఎంకు అందించారు.ఈ వీడియోకు స్టాలిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్ కానుకతో తన హృదయం నిండిపోయిందన్నారు. జూన్ 4న ఇండియా కూటమి కూడా తప్పకుండా ఇలాంటి తీపి విజయాన్నే అందుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు.