ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ్టి నుంచి మూడు రోజుల కవిత విచారణ కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆప్కి 100 కోట్ల ముడుపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. అలాగే సౌత్గ్రూప్కి డబ్బులు సమకూర్చడం, వాట్సప్ చాట్స్పై సీబీఐ ప్రశ్నలు వర్షం కురిపిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నార. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను ఆయన కలవ నున్నారు. సాయంత్రం 6 తర్వాత ఆయన కవితతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.