మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డి పటాన్చెరు పట్టణంలోని మార్నింగ్ వాకర్స్ని కలిశారు. వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. సంతలో పది రూపాయల లావాదేవీలు కూడా నేడు డిజిటల్, యూపీఏ ద్వారా జరుగుతు న్నాయన్నారు. అది కేవలం మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాలు సైతం మోదీని అభినందిస్తూ ప్రధాని అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోదీని మూడోసారి ప్రధానిగా చేయాలని రఘునందన్ రావు కోరారు.
మార్నింగ్ వాకర్స్ని కలిసిన రఘునందన్ రావు
0
171
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


