Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఎలక్టోరల్ బాండ్లు కొనుగోళ్లు …. రాజకీయ చిత్రాలు

     ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి విచిత్రంగా ఉంది. బడా సంస్థలు రాజకీయ పార్టీలను మంచి చేసుకునేందుకే పెద్దఎత్తున ఎలక్టోరల్ బాండ్ల సమకూరిస్తే.. చిన్న సంస్థలు, కొత్తగా రిజిస్టర్ అయిన సంస్థలు రాజకీయపార్టీల ప్రాపకం కోసం తమ స్తోమతను మించి, కోట్లు ఖర్చుచేసి బాండ్ల రూపంలో నిధులు అందించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయం ఆఠానా.. ఖర్చు బారానా అన్నట్లు ఉంది ఈ సంస్థల పరిస్థితి. దీనికి కారణం ఏమిటి.. సంస్థల అత్యాశా.. రాజకీయ ఒత్తిడులా.. క్విడ్ ప్రోకో కోసమేనా.. చూడాలి.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దా, చిన్నా సంస్థలన్న తేడా లేకుండా చాలా కంపెనీలు ఎడా పెడా బాండ్లను కొనుగోలు చేసి.. పార్టీలకు అందజేశాయి. కొన్ని సంస్థలు తన పెట్టుబడుల కన్నా.. తమకు వచ్చిన లాభానికి కొన్ని రెట్లు బాండ్ల కోసం ఖర్చుచేసి కేంద్రంలోనూ, రాష్ట్రాలలోని అధికారపార్టీలకు ధారాదత్తం చేశాయి. హైదరాబాద్ కు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గత నాలుగేళ్లలో గడించిన లాభం 36కోట్లే. ఆ కంపెనీ దానికి మూడు రెట్ల మొత్తం 105 కోట్ల రూపాయలను రాజకీయపార్టీలకు నిధిగా సమకూర్చింది. ఆ సంస్థ రామ్కీ గ్రూప్ కు చెందినదే. దానిచైర్మన్ వైసీపీ రాజ్య సభ ఎంపీ అయోధ్యరామిరెడ్డి కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ గడిం చిన లాభాలు 14.16 కోట్ల రూపాయలు కాగా, 2022 జనవరిలో ఆ సంస్థ 50 కోట్ల రూపాయల బాండ్లను కొని కేసీఆర్ కు చెందిన బీఆర్ ఎస్ కు సమర్పించుకుంది.

మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను నిరుడు
రాజకీయ పార్టీలకు అందజేసింది. సీఎం రమేశ్ సంస్థ 30 కోట్లను కాంగ్రెస్ పార్టీకి, పది కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, మరో ఐదు కోట్లు తెలుగుదేశం పార్టీకి అంద జేసింది. కాంగ్రెస్ కు
30 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన రిత్విక్ కంపెనీ హిమాచల్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 1098 కోట్ల రూపాయల విలువైన సున్నీ డ్యామ్ నిర్మాణ కాంట్రాక్టును కైవసం చేసుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనతాదళ్ ఎస్ కు 2023 మేలో బాండ్ల ద్వారా 41 కోట్లు అందాయి. వీటిలో రిత్విక్ కంపెనీ నుంచి 10 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఐలాబ్స్ మరో మూడు కంపెనీలనుంచి మరో 15 కోట్ల అందాయి. ఐలాబ్స్ తో పాటు కేసీఆర్ ఎంటర్ ప్రైజెస్, నిభా బయోటెక్ సంస్థ, సిగ్మా అడ్వాన్స్డ్  సిస్టమ్స్ లిమిటెడ్ ఈ నిధులు అందించాయి. ఏపీలోని ఏలూరుకు చెందిన నారా కన్ స్ట్రక్షన్స్ సంస్థ జేడీఎస్ కు 10 కోట్ల విరాళంగా ఇచ్చింది.

హైదరాబాద్ కుచెందిన వాసవీ అవెన్యూస్ సంస్థ 2023 ఏప్రిల్ 6న 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొత్తగా రిజిస్టర్ అయింది. ఆ సంస్థ మొదలైన మూడు నెలల్లోనే … కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీకి 2023 జూలై లో ఐదు కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందజేసింది. తెలంగాణ కు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ షార్క్స్ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో 2023 మార్చిలో మొదలైంది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్ట్రానిక్ బాండ్లరూపంలో 3.5 కోట్ల విరాళాలు అందజేసింది. షార్క్స్ ఇన్ఫ్రా సంస్థ అడ్రస్ తోనే షార్క్స్ ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ కన్సెల్టెన్సీ లిమిటెడ్ సంస్థ ఒక లక్ష రూపాయల పెట్టుబడితో 2023 జూలైలో మొదలైంది. ఆ కంపెనీ నాలుగు కోట్ల రూపాయలను బీఆర్ ఎస్ కు విరాళంగా ఇచ్చింది.

జంటనగరాలకే చెందిన నిర్మాణ సంస్థ అపర్ణా ఫార్మ్స్, ఎస్టేట్స్ సంస్థ 2020 ఆగస్టు 18న 5 లక్షల పెట్టు బడితో మొదలైంది. సుబ్రమణ్యం రెడ్డి, సన్నా రెడ్డి, చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ 2023 అక్టోబర్ – నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు మరో 15 కోట్లు విరాళంగా అందజేసింది. ఉత్తరాఖండ్ లో సొరంగ మార్గాలను నిర్మిస్తున్న నవయుగ ఇంజినీరింగ్ సంస్థ భారీఎత్తున ఏకంగా 55 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను రెండు విడత లుగా బీజేపీకి సమర్పించింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించే నవయుగ సంస్థ అసోంలోని బ్రహ్మపుత్ర నదిపై ఢోలా -సదియా బ్రిడ్జి కాంట్రాక్టును చేపట్టి పూర్తిచేసింది.

హైదరాబాద్ లో బీఆర్ ఎస్ సర్కార్ హయాలో ఫార్ములా 1రేస్ నిర్వహించిన విషయం గుర్తుందిగా.. నగరానికి చెందిన పునర్వినియోగ ఇంధన సంస్థ గ్రీన్ కో..ఫార్ములా ఇ రేస్ నిర్వహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకు ముందే బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 15 కోట్ల రూపాయలు సమర్పించుకుంది కూడా. గ్రీన్కో.. దాని అనుబంధ సంస్థలు గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్కో బుధిల్ జలవిద్యుత్, గ్రీన్కో రాయల విండ్ పవర్ కంపెనీలు 39 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో బీజేపీకి 32 కోట్లు, బీఆర్ ఎస్ కు 13 కోట్లు ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ కు 6 కోట్లు బాండ్ల రూపంలో చెల్లించాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ము లా రేస్ ను రద్దు చేయడంతో గ్రీన్కో శ్రమ వృథా అయింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్