పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ.. మోకాళ్లపై 501 మెట్లు ఎక్కిన మహిళ

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాని పవన్ కల్యాణ్(Pavan Kalyan) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ(Socia Media), వెలుపలా పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

 

ఈ ఆలయం ఓ కొండపై కొలువై ఉంది. కాగా, సదరు మహిళ పవన్ కు వీరాభిమాని, జనసేనకు గట్టి మద్దతుదారు. ఆమె రణమండల హనుమాన్ ఆలయం వద్దకు చేరుకునేందుకు మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్నదే ఆమె ఆకాంక్ష. ఆ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఎంతో కష్టమైనప్పటికీ ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Latest Articles

అల్వాల్‌లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ సీజ్‌

అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్‌లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్