RK Roja | పవన్ – చంద్రబాబు భేటీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరి భేటీ కొత్తేం కాదని.. ముసుగులేసుకుని కలుస్తారని అన్నారు. మొదట్లో అయితే హాట్ టాపిక్ గానీ.. ఇప్పుదైతే ఇదంతా కామన్ అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను రాజకీయంగా తరిమేయాలన్న కుట్ర జరుగుతూనే ఉందని.. చంద్రబాబు ఇప్పటికీ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై మండిపడుతూ.. ఏదైనా ఒక్క వెల్ఫేర్ స్కీం చేసారేమో చెప్పమనండి? అంటూ ప్రశ్నించారు. ఏ కష్టం వచ్చినా ప్రజలు భయపడటం లేదు.. నగరి, కుప్పం, పవన్ ఓడిపోయిన ఏ నియోజకవర్గానికైనా వెళదాం..ప్రజలు ఏం చెబుతారో చూద్దాం.. ఆ ధైర్యం మాకుంది… మీకుందా? అంటూ చురకలు అంటించారు.