Nagpur |అధిక మద్యం సేవించి మోతాదుకు మించి వయాగ్రా వాడడంతో ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ సంఘటనకు సంభందించిన విషయాలను జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ ప్రచురించింది. ఈ మెడిసిన్ వాడేటప్పుడు వైద్యుల సలహా, సూచనలు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించింది.
మెడిసిన్ జర్నల్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో గల ఓ వ్యక్తి పీకలదాకా తాగి లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ఆపై తనతో వచ్చిన మహిళతో రాత్రంత గడిపాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాంతులు విపరీతంగా అవుతుండడంతో.. వెంట వచ్చిన మహిళ హోటల్ సిబ్బంది సాయం కోరింది. దీనికి ఆ వ్యక్తి సహాయాన్ని నిరాకరించడంతో గదిలోనే ఉండిపోయారు. మరికాసేపటికి పరిస్థితి తీవ్రతరం కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి తీసుకొస్తుండగానే చనిపోయాడని వెల్లడించారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం.. రక్తం గడ్డకట్టడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని.. ఆల్కహాల్ తో పాటు వయాగ్రా తీసుకోవడం, గతంలో రక్తపోటు ఉండటం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది.
Read Also: ఏసీ పేలి.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
Follow us on: Youtube Instagram