35.2 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

టికెట్‌ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎమ్మెల్యే తాటికొండ

స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ (Station Ghanpur) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌(BRS) తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiam Srihari) పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.

 అయితే.. టికెట్‌ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్