బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మూసి వేతపై ఫేక్ సర్యూలర్ కేసులో చంచల్గూడ జైలులో ఉన్న క్రిశాంక్ను కేటీఆర్ కలిశారు. క్రిశాంక్ చేసింది తప్పయితే తాను జైలుకు వెళ్తాననని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్ తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలని ఛాలెంజ్ చేశారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిశాంక్ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.