31.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

‘మూడుసార్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్ ది’

స్వతంత్ర, వెబ్ సైట్: ఏపీలో ఈరోజు కరెంటు చార్జీలు మోత మోగిపోతుందన్నారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. గుంటూరు జిల్లా తుళ్ళూరులో కరెంటు చార్జీల పెంపుపై వ్యతిరేకతను తెలియజేస్తూ తుళ్లూరు టీడీపీ కార్యాలయంలో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడుసార్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. 2019వ సంవత్సరం చంద్రబాబు నాయకత్వంలో ఒక సామాన్య కుటుంబానికి 166/- కరెంట్ bill వస్తె.. అదే సామాన్య కుటుంబానికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో 607/- బిల్ వచ్చిందన్నారు. బిల్లును ఎన్నిరెట్లు పెంచారో గమనించండని అన్నారు. గతంలో 2014లో కరెంట్ కోతలతో విసుగెత్తిపోతున్న ప్రజలకు కేవలం 100 రోజుల్లో విముక్తి కలిగించిన ఘనత తెలుగుదేశం పార్టీది, అది చంద్రబాబుకే సాధ్యపడింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అవినాష్ రెడ్డి దగ్గర నుండి నాసిరకంగా ట్రాన్స్ఫార్మర్లను వాడడం, ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ సామాన్య ప్రజలపై భారం మోపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్