నేడు సీఎం జగన్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన 11 లక్షల 59వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. గతేడాది మిచౌంగ్ తుఫాన్తో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 6 లక్షల 65వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పంట నష్టపోయిన రైతులకు 1,200 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.