ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218, భారత్ 477 పరుగులు చేశాయి. దీంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 84, బెయిర్ స్టో 39 పరుగులు చేశారు. మొత్తం మ్యాచ్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు.