స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి కడియం శ్రీ హరిపై( Kadiam Sri Hari) ఎమ్మార్పీఎస్(MRPS) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ను కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించడంపై ఆయన మండిపడ్డారు.
కడియం శ్రీహరి ఒక గుంట నక్క అని అన్నారు. గతంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కడియం శ్రీహరి కారణమని, ఇప్పుడు ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా ఆయనే కారణమని అన్నారు. మాదిగ టికెట్ ను మాదిగకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ అయిన రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే…ఆ టికెట్ ను మరో మాదిగకే ఇవ్వాలని అన్నారు. కడియం శ్రీహరికి బీఫామ్ ఎలా వస్తుందో తాను చూస్తానని సవాల్ విసిరారు.