ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తవ్వేకొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నా యి. ఇజ్రాయెల్‌ నుంచి పరికరాలను తెప్పించి ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయడం సంచలనం సృష్టించింది. దీని వెనుక SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉండటం కలకలం రేపింది. వీరంతా కలిసి రాజకీయ నేతలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ప్రముఖులను బెదిరించి డబ్బులు దోచుకున్నట్లు కూడా తెలిసింది. మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ,..ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు నిందితుల తరపున లాయర్లు సమయం కోరారు. ఇవాళ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు.

 

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్