మాజీ సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జగన్ దాఖలు చేసిన ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.