వరంగల్ లో గవర్నర్ పర్యటన.. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ

స్వతంత్ర వెబ్  డెస్క్: వరద ప్రభావం వరంగల్ లో దారుణంగా ఉందని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. ఇవాళ హనుమకొండ జిల్లాలో వర్షాలతో ముంపుకు గురైన వరద బాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు కావాల్సిన మందులు పంపిణీ చేసి వారిని ఉద్దేశించి మాట్లాడారు. హనుమకొండ నగర కేంద్రమైన జవహర్ నగర్ ప్రాంతంలో అధిక ప్రాంతం ముంపు గురై ,ఇక్కడి బ్రిడ్జి బాగా దెబ్బతిన్నట్టు ఆమె తెలిపారు.
బ్రిడ్జి పనులు వెంటనే మరమ్మతు చేపట్టి నీరు సాఫీగా వెళ్లిపోవడానికి అధికారులు చొరవ తీసుకొని సహకరించాలని కోరారు. గతంలో పలుమార్లు స్థానికులు ప్రభుత్వ అధికారులకు విన్నపించినప్పటికీ సమస్య ఇదేవిధంగా ఉండడం ఆమె తప్పు పట్టారు. సమస్య పరిష్కారాలు దీర్ఘకాలంగా ఉండాలని ,అవి శాశ్వత పరిష్కారం కావాలని ఆమె కోరారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని వరదల విషయం తాను సోషల్ మీడియా ద్వారా వీడియోలను చూసి వెంటనే రెడ్ క్రాస్ సిబ్బందికి సమాచార చేరవేసి బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్