స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. కేబుల్స్ తగిలి చెట్టుకు విద్యుత్ రావటంతో ఆడుకుంటూ శ్రీలక్ష్మి (5) అనే చిన్నారి చెట్టును పట్టుకుంది. దీంతో ఈ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించిన బాపనమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చిన్నారి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.