దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్కి పొలిటికల్ చిప్ కారాబ్ అయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకొని రావాలని… కావాలంటే దానికి అయ్యే ఖర్చునూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఇస్తుందని జగ్గారెడ్డి సెటైర్లు వేశారు.