రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత మాటను నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల నోరుకు పని చెప్పారు. దీంతో రేవంత్ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడిచింది. ఆ సమయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగింది. దీంతో మరోసారి ఆగష్ట్ 15 నాటికి రుణమాఫీ చేస్తా నని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై కసరత్తు చేస్తు న్నారు సీఎం రేవంత్. త్వరలోనే రైతులకు శుభవార్తు చేప్పేందుకు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రుణమాఫీపై రైతులు, రైతు సంఘాల నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే, సంపన్నులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచన లు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పని సరిగా ఉండాలన్న వినతుల మేరకు. అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్
0
220
Previous article
Next article
Latest Articles
బాసర ఆలయంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
బాసర ఆలయంలో జరిగిన చోరీని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతికత సాయంతో పది రోజుల్లోనే దొంగలను గుర్తించారు. 6 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలతో...
- Advertisement -
- Advertisement -


