ఈ నెల 27న మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ నెల 27న మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే.. ఈ నెల 27న మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే.. మహబూబాబాద్‌ జిల్లా శనగపురం రహదారి పక్కన సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్ర ప్రజల జీవన విధానం నుంచి పుట్టినదే బతుకమ్మ పండుగ. పువ్వులే బతుకమ్మగా పూజలు అందుకోవటాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞత భావన తెలుస్తోంది. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలి’ అని కేసిఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్