స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు 12వ తేదీ ఉ. 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో క్రోసూరుకు రానున్నారు. క్రోసూరు మోడల్ స్కూల్ లో జగనన్న విద్యాకానుక నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం అమరావతి – బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మాణం జరుగనుంది. అనంతరం మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.60 కోట్లతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. అలాగే క్రోసూరులో రూ.7.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం జగన్
0
410
Previous article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


