ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. కొన్ని సెగ్మెంట్లల్లో అభ్యర్థి త్వాల మార్పుపై తర్జన భర్జనలో ఉంది టీడీపీ. కొలిక్కి రాని సీట్లల్లోని అభ్యర్థులకు బీ-ఫారాల జారీని పెండింగులో పెట్టే ఛాన్స్ ఉంది. చివరి నిమిషంలో దెందులూరు టిక్కెట్టుపై ట్విస్ట్ నెలకొంది. బీ-ఫారం తీసుకోవడానికి రావొద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బీ-ఫారం తీసుకోవడానికి రావాలని చింతమనేనికి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నారు చింతమనేని. అయితే, బీజేపీతో అనపర్తి సీట్ ఎడ్జస్ట్మెంటులో భాగంగా దెందులూరు విషయమై టీడీపీ కసరత్తు చేస్తోంది. మడకశిర, ఉండి, పాడేరు, సుళ్లూరుపేట, మాడుగుల వంటి సెగ్మెంట్లల్లో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్న చంద్రబాబు
0
174
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


