స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతి రైతులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకుకే జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేదవాళ్లను మోసగించడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు CRDA విధివిధానాల్లో భాగంగా అమరావతిలో 5శాతం భూమిని పేదల కోసం కేటాయించామని తెలిపారు. కానీ వైసీపీ సర్కార్ ఆర్-5 జోన్ తెచ్చి ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని పేర్కొన్నారు. పేదలను మోసం చేయడమే కాకుండా రైతులకూ అన్యాయం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్-5 జోన్ జీవోతో పేదలకు అన్యాయం: చంద్రబాబు
0
453
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


