స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతి రైతులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకుకే జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేదవాళ్లను మోసగించడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు CRDA విధివిధానాల్లో భాగంగా అమరావతిలో 5శాతం భూమిని పేదల కోసం కేటాయించామని తెలిపారు. కానీ వైసీపీ సర్కార్ ఆర్-5 జోన్ తెచ్చి ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని పేర్కొన్నారు. పేదలను మోసం చేయడమే కాకుండా రైతులకూ అన్యాయం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్-5 జోన్ జీవోతో పేదలకు అన్యాయం: చంద్రబాబు
0
418
Previous article
Next article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


