త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ CBSE( Central Board of Secondary Education) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP) అమలులో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

CBSE తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించింది.

అయితే పదో తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష నిర్వహించబోమని CBSE వెల్లడించింది. విద్యార్థులపై అదనపు ఒత్తిడి లేకుండా భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

జులై 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న CBSE అనుబంధ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

భారతీయ భాషల ప్రాధాన్యతను పెంచడం, విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చినట్లు CBSE పేర్కొంది.

Latest Articles

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య … అప్పుల వివాదమే కారణమా?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్